తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంచిర్యాల, ములుగు, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రుతుపవనాలు మధ్యప్రదేశ్లోని నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండడమే ఈ వర్షాలకు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది.