- అయినా సరే నాకు టికెట్ ఇవ్వలేదు..
- ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై ఓ వ్యక్తి ఫిర్యాదు
- చీటింగ్ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ కేఏ పాల్ రూ.50 లక్షలు తీసుకుని మోసం చేశారని రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్కుమార్ ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘గతేడాది జరిగిన అసెంబ్లీకి ఎన్నికల్లో కేఏ పాల్ నాకు ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ ఇస్తానని మాటిచ్చారు. అందుకోసం నా దగ్గర నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారు. రూ.30 లక్షలు ఆన్లైన్లో చెల్లించాను. మిగతా రూ.20 లక్షలు పలు దఫాలుగా పాల్కు నేరుగా చెల్లించాను. అయినా కూడా నాకు టికెట్ మాత్రం ఇవ్వలేదు’ అని బాధితుడు కిరణ్కుమార్ పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేఏ పాల్ విశాఖపట్నం ఎంపీగా, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అంతేకాదు విశాఖలో పోలైన 14 లక్షల ఓట్లలో 9 లక్షల ఓట్లు తనకే వస్తాయని ప్రచారం చేసుకున్నాడు. దీంతో పాల్పై అక్కడ కూడా కేసు నమోదైంది.