దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 267.75 పాయింట్ల లాభంతో 74,221.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 68.75 పాయింట్ల లాభంతో 22,597.80 వద్ద స్థిరపడింది. హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. SBI, JSW స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.28గా ఉంది.