టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల జాక్పాట్ కొట్టారు. వారు 2020లో బీమా ఉత్పత్తులను విక్రయించే గో డిజిట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్లో రూ.2.5కోట్లు పెట్టుబడి పెట్టగా.. అదిప్పుడు నాలుగింతలయ్యింది. ఈ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవగా.. భారీగా లాభాలు గడించింది. దీంతో కోహ్లీ దంపతులు పెట్టిన రూ.2.5 కోట్ల పెట్టుబడి ప్రస్తుతం అది రూ.10కోట్లకు పైగా ఉంది.