దేశీయ స్టాక్ మార్కెట్(Stock market)సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 75,585.40 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 75,083.22 – 75,585.40 మధ్య కదలాడింది. చివరికి 220.05 పాయింట్ల నష్టంతో 75,170.45 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 44.30 పాయింట్ల నష్టంతో 22,888.15 వద్ద స్థిరపడింది.