దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నేడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభమయ్యే సమయంలో సెన్సెక్స్ 223 పాయింట్ల నష్టంతో 74,947 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 22,803 దగ్గర కొనసాగుతోంది. భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ఫార్మా, హెచ్సీఎల్ టెక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్గ్రిడ్, టాటా మోటార్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.