దేశీయ స్టాక్ మార్కెట్(Stock market) సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం వంటి కారణాలతో సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్ 660కు పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22,700 ఎగువన ముగిసింది. ఇంట్రాడేలో 74,454.55 – 74,986.22 పాయింట్ల మధ్య చలించిన సూచీ.. చివరికి 667.55 పాయింట్ల నష్టంతో 74,502.90 వద్ద ముగిసింది.