రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ట్యాంక్బండ్పై నిర్వహిస్తున్నందున ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు సాధారణ వాహనాలను ట్యాంక్బండ్పైకి అనుమతించబోమని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి, రవీంద్రభారతి నుంచి, ఎన్టీఆర్ మార్గ్ నుంచి, జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి, ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు వివరించారు.