Homeతెలంగాణఅభ్యర్థులకు అలర్ట్.. గురుకుల పోస్టుల భర్తీ పై కసరత్తు..!

అభ్యర్థులకు అలర్ట్.. గురుకుల పోస్టుల భర్తీ పై కసరత్తు..!

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ,అధ్యాపక ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను ముగించేందుకు కసరత్తు మొదలైంది. గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గురుకుల నియామకబోర్డు 2023 ఆగస్టులో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల అభ్యర్థులకు నియామకపత్రాలు ఇవ్వలేదు. అంతలోనే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వచ్చింది.ప్రస్తుతం కోడ్‌ ముగియడంతో పోస్టింగుల ప్రక్రియ పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నారు.

Recent

- Advertisment -spot_img