విశాఖ కేజీహెచ్లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన తాపత్రయం నెట్టింట వైరలవుతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణి విశాఖ కేజీహెచ్లో బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యరీత్యా ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు తెలిపారు. సమయానికి సిబ్బంది లేకపోవడంతో తండ్రి విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ భుజాన మోసుకుని, NICUకి తీసుకువెళ్లి చిన్నారిని రక్షించుకున్నారు.