Homeఫ్లాష్ ఫ్లాష్T20 World Cup: నేడు అఫ్గాన్‌తో భారత్ పోరు.. బ్రిడ్జ్‌టౌన్‌ పిచ్​ ఎలా ఉందంటే?

T20 World Cup: నేడు అఫ్గాన్‌తో భారత్ పోరు.. బ్రిడ్జ్‌టౌన్‌ పిచ్​ ఎలా ఉందంటే?

టీ20 వరల్డ్ కప్‌ సూపర్-8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో భారత్ జట్టు గురువారం తలపడనుంది. గ్రూప్ దశలో తిరుగులేని విజయాలు సాధించిన భారత్‌తో తలపడడం అఫ్గాన్‌కు సవాలే. అయితే న్యూజిలాండ్ వంటి జట్టును 84 పరుగుల తేడాతో అఫ్గాన్ ఓడించి ఉత్సాహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌ జట్టులో కోహ్లి, రోహిత్, జడేజా, దూబే, సిరాజ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగే మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
T20 వరల్డ్‌కప్ సూపర్-8లో భాగంగా బ్రిడ్జ్‌టౌన్ మైదానంలో నేడు భారత్‌, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జ్‌టౌన్‌ పిచ్‌ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడ జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 200 పైచిలుకు స్కోరు చేసింది. దీంతో పాటు మరో రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు కూడా బాగానే రాణించారు. నేటి మ్యాచ్‌కు వర్షం ముప్పేమీ లేదు.

Recent

- Advertisment -spot_img