నెల్లూరు జిల్లాలోని కావలి మద్దూరుపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.