Homeహైదరాబాద్latest Newsడాక్టర్ కాంపల్లి శంకర్ కు మహనంది అవార్డు

డాక్టర్ కాంపల్లి శంకర్ కు మహనంది అవార్డు

ఇదే నిజం, బెల్లంపల్లి: మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగాతెలుగు వెలుగు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో అందజేతజ్యోతిర్ వాస్తు సేవలు అందించినందుకు వరించిన అవార్డు బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, జ్యోతిర్ వాస్తు నిపుణులు డాక్టర్ కాంపల్లి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా సనాతన ధర్మంపై మక్కువతో జ్యోతిర్వాస్తు సేవలు ఉచితముగా అందించినందుగాను తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు వెలుగు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో 30 జూన్ 2024 ఆదివారం ఉదయం కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో ఆయనకు మహా నంది అవార్డును మరియు జాతీయ పురస్కార సన్మాన పత్రాన్ని ప్రదానం చేశారు.
వాస్తు – జ్యోతిష్యంపై ఆసక్తితో.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ కాంపల్లి శంకర్ సనాతన ధర్మం, జ్యోతిష్యం మరియు వాస్తు పైన గల ఆసక్తితో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిర్వాస్తు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమాలో అభ్యసించి ఆధునిక నిర్మాణ శిల్పం ఆర్కి స్ట్రక్చర్, వాస్తు బేసిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్, జ్యోతిష శాస్త్ర ప్రాథమిక అంశాలు, దేవాలయాల వాస్తు శిల్పరీతులు, భూమి కొలతలు, గృహ నిర్మాణ వాస్తు, స్థల వాస్తు, బోరు బావుల వాస్తు” తదితర అంశాలపై అధ్యయనం పూర్తి చేశారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో జ్యోతిర్వాస్తు పిజి డిప్లమా ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాన్ని పొంది బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా జ్యోతిర్ వాస్తు సేవలు ఉచితముగా ప్రజలకు అందించినందుకు గాను ఆయనకు నంది అవార్డు ప్రకటించారు. బెల్లంపల్లి నుంచి తరలి వెళ్ళిన డాక్టర్ కాంపల్లి శంకర్ అక్కడి ముఖ్య అతిథుల చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నారు.అభినందనల వెల్లువ
ఈ సందర్భంగా డాక్టర్ కాంపల్లి శంకర్ ని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, జాతీయ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల వారు కుటుంబ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు అభినందించారు. బెల్లంపల్లి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న డాక్టర్ కాంపల్లి శంకర్ సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా నిత్య అన్నదానంతో పాటు ప్రత్యేక జ్యోతిర్వాస్తు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, సేవకులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. జ్యోతిష్యం మరియు వాస్తు శాస్త్రంలో ఆయన మరెన్నో మెట్లు ఎక్కి అద్భుతాలు సాధించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.వాస్తవ’

వాస్తు.. నిజమైన జ్యోతిష్యం చూసుకోండి
బెల్లంపల్లి ప్రాంత ప్రజలు సరైన వాస్తు జ్యోతిష్య విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని పట్టణానికి చెందిన జ్యోతిర్ వాస్తు నిపుణులు డాక్టర్ కాంపల్లి శంకర్ ఆకాంక్షించారు. బాయిజమ్మ సేవలు, షిర్డీ సాయి బాబా బోధనల స్ఫూర్తితో వాస్తు, జ్యోతిష్యం సేవలు చేయడానికి తాను విరామ సమయాలలో అందరికీ అందుబాటులో ఉంటానని జ్యోతిర్ వాస్తు సేవల సలహాలు సూచనలకు ఈ నెంబర్లో 9440937675, 9959269975 సంప్రదించగలరని జ్యోతిర్వాస్తు నిపుణులు డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు.
అవార్డుతో బాధ్యత పెరిగింది..
నంది అవార్డు ఇచ్చినందుకు గాను తెలుగు వెలుగు సాహితీ వేదిక బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్, బ్రహ్మశ్రీ బాణాల రాజు చారి అద్దంకి కృష్ణమాచారి ఆర్ఎస్ నంద విశ్వవిద్యాలయాల ఉపకుల పతులకు రిజిస్టార్లకు ప్రొఫెసర్లకు, ఐ.రమేష్ జర్నలిస్టులకు నిర్వాహకులకు డాక్టర్ కాంపల్లి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ బెల్లంపల్లి పరిసర ప్రాంత ప్రజల సేవలో ఎల్లవేళలా ముందుంటానని అన్నారు.

Recent

- Advertisment -spot_img