తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రబడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రాజెక్టుల అంశంలో రాష్ట్రానికి ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు.