Homeహైదరాబాద్latest Newsప్రజా ప్రభుత్వం.. విద్యా వ్యవస్థకు శాపం.. కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ప్రజా ప్రభుత్వం.. విద్యా వ్యవస్థకు శాపం.. కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ సర్కార్ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోంది
  • కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండేది
  • విద్యా మంత్రిత్వ శాఖ సీఎం రేవంత్ వద్దే ఉన్న సమస్యలు పట్టించుకోరా..?
  • మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. టీచర్లు, పుస్తకాలు, దుస్తుల కొరత, వేతనాల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయన్నారు. విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉన్న సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన టీచర్లు, విద్యార్థులు పాఠశాలలకు శాపంగా మారిందన్నారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న 54,201 మంది వంట మనుషులు, హెల్పర్లకు ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్జీటీల బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ సుమారు 9 వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. విద్యార్థులకు జత బట్టలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, రెండు జతల బట్టలు అందించాలన్నారు. విద్యార్థుల ఆకలి తీర్చే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img