ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మలావత్ పూర్ణ.. 2014 ఏప్రిల్ 14న పర్వత అధిరోహానికి బయల్దేరి మే 25న ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుంది. అతిచిన్న వయస్సులో ఆమె ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి ‘యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియా’గా రికార్డు సృష్టించింది. దానికి ఫలితంగా ప్రభుత్వం ఆమెకు బహుమతులతో సత్కరించింది. అయితే, అసలు మలావత్ పూర్ణ ఏ శిఖరాన్ని ఎక్కలేదని, ఎక్కలేదనడానికి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అడ్వెంజర్ క్లబ్ ప్రెసిడెంట్ కెప్టెన్ కె. రంగారావు ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వూలో ఆరోపించారు. ‘అసలు నిజంగా పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తే.. ఒక్కఫొటో అయినా ఉండాలి కదా? కేవలం ఇదంతా ఆమె కోచ్ శేఖర్బాబు, అందుకు ఆర్థిక సహకారం అందించిన మాజీ ఐపీఎస్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రపంచానికి ఫేక్ ఫెయిల్యూర్ సక్సెస్’ అని సంచలన ఆరోపణలు చేశారు. ‘పూర్ణ.. ఎవరెస్ట్ అధిరోహించానని చెబుతున్న ఆమె అనుభవాలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతనే లేదు’ అని ఆ ఇంటర్వూలో అన్నారు. రంగారావు చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.