ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా స్థాయి కార్యకర్తలతో మెట్ పెల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో ఒకరోజు అభ్యాస్ వర్గ కార్యక్రమం జిల్లా,ప్రఖండ, మరియు నగర స్థాయి కార్యవర్గ నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లపెల్లి బజరంగ్ దళ్ మండల కన్వీనర్ గా ఎనగందుల రమేష్, కో కన్వీనర్ గా భీమ జలపతిని భజరంగ్ దళ్ రాష్ట్ర కో కన్వీనర్ వెంకట్ నియమించడం జరిగింది. ఈ నియామకానికి విభాగ్ సహా సంయోజక్ అల్లే మధు, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గజం రాజు, విశ్వహిందూ పరిషత్ విభాగ్ సామజిక సమస్రత సహా ప్రముఖ్ దుర్గ ప్రసాద్,జిల్లా గో రక్షక్ ప్రముఖ్ ఆడెపు నరేష్ సహకరించారు. రాష్ట్ర కో కన్వీనర్ వెంకట్ భజరంగ్ దళ్ నూతన కార్యకర్తలకు భజరంగ్ దళ్ సాధించిన గొప్ప విజయల గురించి, రాబోయే కాలంలో భజరంగ్ దళ్ చేయబోయే కార్యాచరణ గురించి వివరించారు.