Homeజిల్లా వార్తలుమల్లికార్జున స్వామిని దర్చించుకున్న ఎస్సై చిర్ర సతీష్

మల్లికార్జున స్వామిని దర్చించుకున్న ఎస్సై చిర్ర సతీష్

ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి వారిని సోమవారం రోజున గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి తమ్మల రాజేంధర్,గుడి చైర్మన్ తమ్మల శాంతయ్య ఎస్సై కి తీర్థ ప్రసాదాలు అందజేయగా, మాజీ సర్పంచ్ భీమ సంతోష్ ఎస్సై సతీష్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కిషోర్, హెడ్ కానిస్టేబుల్ గణేష్,హోంగార్డ్ శ్రీనివాస్, అనంతుల మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img