టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. కానీ, ఇంకా అధికారిక ప్రకటన మాత్రం ఆలస్యమవుతోంది. సహాయక కోచ్ల ఎంపిక విషయంలో కూడా బీసీసీఐ గంభీర్కు పూర్తిస్వేచ్ఛ ఇచ్చిందట. అందుకే అధికారిక ప్రకటన ఆలస్యమవుతోందని సమాచారం. ఈనెల 27 నుంచి శ్రీలంక, భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. ఆలోపు కొత్త కోచ్ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.