రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమాలపై కేటీఆర్ స్పందించారు. “ఓయూలో తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నఅభ్యర్థుల వెంటపడి మరీ పోలీసులు అరెస్ట్ చేసి ఈడ్చుకువెళ్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఎన్నికల ముందు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే అణచివేతకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్ మీద నిరుద్యోగ యువత భగ్గుమంటున్నారని” బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేయగా కేటీఆర్ రీట్వీట్ ని షేర్ చేశారు.