ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన పోకడలు కని పిస్తున్నాయి. ఇష్టానుసారం పోస్టులు.. విచ్చలవిడిగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై చట్టం దృష్టి సారించింది. ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్లకు పాల్పడితే ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం ఐదేళ్ల శిక్ష పడుతుంది. అందుకే సోషల్మీడియాలో పోస్టులు పెట్టే ముందు.. కామెంట్, షేర్ చేసే సమయంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిందే.