విశాఖకు త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టు కూడా వస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు వరకు మెట్రోను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. వైజాగ్ను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్టుతో పాటు రాష్ట్రంలో నూతనంగా మరో ఐదు ఎయిర్ పోర్టులను నిర్మిస్తామని చెప్పారు.