Homeహైదరాబాద్latest Newsహామీలను గాలికొదిలేసి.. అస్మదీయులను మాత్రం అందలం ఎక్కిస్తుండుగా మన సీఎం

హామీలను గాలికొదిలేసి.. అస్మదీయులను మాత్రం అందలం ఎక్కిస్తుండుగా మన సీఎం

ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎనిమిది నెలలైనా హామీల అమలు అంతంత మాత్రంగానే ఉంది. దీని పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, మన సీఎం రేవంత్ రెడ్డి అస్మదీయులను మాత్రం అందలం ఎక్కిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న వారందరికీ జాబ్‌ గ్యారంటీ అంటూ ఒక్కో పదవిలో కూర్చోబెడుతున్నారు. ఆ కేసులో డబ్బు సంచులతో కెమెరాకు చిక్కిన సీఎం రేవంత్‌ ముఖ్య అనుచరుడు రుద్ర ఉదయ సింహాకు ఢిల్లీలో ఓ పదవి ఇచ్చారు. దీంతో ఓటుకు నోటు కేసులోని నిందితులపై చర్చ మొదలైంది. రాజ్యం మనదైతే కొలువులు కూడా మనవే అన్నట్టుగా అందరికీ ఒక్కో పదవి ఇచ్చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Recent

- Advertisment -spot_img