కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని NDA సర్కారుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎంపీ సీట్లు గెలిపించి ఆశీర్వదిస్తే.. ఏం ఇచ్చారని మండిపడ్డారు. కష్టకాలంలో 8 ఎంపీ సీట్లను గెలిపిస్తే తాజా బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో రైలు పొడగింపునకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.