Homeహైదరాబాద్latest Newsబెల్లంపల్లి విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి

బెల్లంపల్లి విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి

ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలను వార్డ్ కౌన్సిలర్ ప్రభాకర్ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ… మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. పాఠశాలలో చేపట్టవలసిన మరమత్తు పనులను త్వరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే కాకుండా వారి పై ప్రత్యేక దృష్టి సారించి వారికి విద్యాబుద్ధులు నిర్మించాలని రాబోయే తరానికి వారే కాబోయే మేధావులని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండి గంగారం నగర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img