విద్యార్థి సంఘాల ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. సైన్యం పాలన కొనసాగుతున్న బంగ్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జషోర్ జిల్లాలో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్కు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్కు అల్లరిమూకలు నిప్పు పెట్టాయి. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో బంగ్లాలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440కి చేరుకుంది.