Homeజిల్లా వార్తలుఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మండల వైద్యాధికారి నరేష్

ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మండల వైద్యాధికారి నరేష్

ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలోని సీజనల్ వ్యాధుల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినారు. ee కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల వైద్యాధికారి సిహెచ్ నరేష్ పాల్గొన్నారు. మండల వైద్యాధికారి నరేష్ మాట్లాడుతూ.. ఇంటి వద్ద నీటి నిలువ ఉంచుకోకూడదు. వాటి ద్వారా దోమలు గుడ్లు పెట్టి, వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని డెంగు, మలేరియా, విరోచనాలు మొదలైన వ్యాధులు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. డ్రై డే ఫ్రైడే తో పాటుగా హెల్త్ క్యాంపు నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్, ఎం ల్ హెచ్ పి కరుణ, ఏఎన్ఎం విజయ, ఆశ వర్కర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img