బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్న వేళ మహిళల టీ20 ప్రపంచకప్పై బీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లా వేదికగా మరో రెండు నెలల్లో మహిళల టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే అక్కడి ప్రస్తుత పరిస్థితుల్లో ప్లేయర్ల భద్రతపై బంగ్లా క్రికెట్ బోర్డు మల్లగుల్లాలు పడుతోంది. భద్రతకు సంబంధించి హామీ ఇవ్వాల్సిందిగా దేశ ఆర్మీ చీఫ్ను బీసీబీ కోరింది.