గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్లో అనేక బగ్లు ఉన్నాయని.. వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెనీ రెస్పాన్స్ టీమ్(CERT-In) పేర్కొంది. గూగుల్ యూజర్లు క్రోమ్ బ్రౌజర్ను వెంటనే అప్డేట్ చేయాలని సూచించింది. బ్రౌజర్లోని లోపాలతో హ్యాకర్లు సిస్టమ్స్ను ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని వివరించింది.