Homeహైదరాబాద్latest Newsఅక్కాచెల్లెళ్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. ఎవరు చేశారు? ఎందుకు చేశారంటే..?

అక్కాచెల్లెళ్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. ఎవరు చేశారు? ఎందుకు చేశారంటే..?

అక్కాచెల్లెళ్ల కిడ్నాప్ కేసును తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. జులై 22న ధవళేశ్వరంలో ఇద్దరు బాలికలు కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ కిడ్నాప్ కేసును నేడు పోలీసులు చేధించారు. కిడ్నాపర్ మారోజు వెంకటేష్ పోలీసులకు చిక్కాడు. కిడ్నాప్‌కు గురైన అక్కాచెల్లెళ్లు సేఫ్‌గా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కాగా, కిడ్నాపర్ పట్టుబడటంతో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.. విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ మోసగాడని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. విజయనగరంలో ఒక యువతిని వివాహం చేసుకున్న వెంకటేష్.. భార్య ఉండగానే మరో మైనర్ బాలికతో ప్రేమాయణం నడిపాడట. ఇక, ప్రియురాలును చెల్లిగా పరిచయం చేసి 3 నెలల క్రితం ధవళేశ్వరంలో ఓ ఇంట్లో కాపురం పెట్టాడట.. ప్రియురాలును గత నెల 22వ తేదీన రాజమండ్రిలో బస్సు ఎక్కించి విజయనగరం జిల్లాలోని ఆమె ఇంటికి పంపించిన మోసగాడు.. ధవళేశ్వంలో తాను ఉంటున్న ఇంటిలోనే అద్దెకు ఉన్న ఒడిశాలోని బరంపూర్ కు చెందిన ఇద్దరు మైనర్లను అపహరించాడు.. 20 రోజులుగా కిడ్నాపర్ వెంకటేష్‌తోనే ఉన్నారు ఆ ఇద్దరు బాలికలు.. అయితే, అక్కాచెల్లెళ్లును కిడ్నాప్ చేసిన మారోజు వెంకటేష్ పై గత నెల 29వ తేదీన ధవళేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి సునీత.. ఇక, రంగంలోని దిగిన పోలీసులు.. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. ఈ తెల్లవారుజామున కిడ్నాపర్ వెంకటేష్ ను పట్టుకున్నారు.. ఇద్దరు బాలికలను తల్లి సునీతకు అప్పగించారు పోలీసులు.

Recent

- Advertisment -spot_img