Homeహైదరాబాద్latest Newsఅగ్ని ప్రమాదానికి గురైన త్రివేణి రైస్ మిల్లు.. సందర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

అగ్ని ప్రమాదానికి గురైన త్రివేణి రైస్ మిల్లు.. సందర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

ఇదే నిజం, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామంలోని త్రివేణి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో శుక్రవారం రోజున విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు శనివారం ఉదయం రైస్ మిల్లును సందర్శించారు. మిల్లులో ఉన్న వరి ధాన్యం అధిక మొత్తంలో కాలిపోవడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు రైస్ మిల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img