Homeహైదరాబాద్latest Newsఘ‌నంగా ర‌క్షా బంధ‌న్ వేడుక‌లు..సీఎం రేవంత్ కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క.. సోద‌రి క‌విత‌ను...

ఘ‌నంగా ర‌క్షా బంధ‌న్ వేడుక‌లు..సీఎం రేవంత్ కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క.. సోద‌రి క‌విత‌ను త‌ల్చుకొని కేటీఆర్ భావోద్వేగం

  • శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకున్న ప్ర‌ముఖ నేత‌లు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో : దేశ‌వ్యాప్తంగా రాఖీ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. సోద‌ర‌సోద‌రీమ‌ణుల బంధానికి ప్ర‌తీక‌గా నిలిచే రాఖీ వేళ ప‌లువురు మ‌హిళా నేత‌లు రాఖీలు క‌ట్టి త‌మ ప్రేమ‌ను తెలిజేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయ‌న నివాసంలో మంత్రి సీత‌క్క రాఖీ క‌ట్టి శుభాకంక్ష‌లు తెలిపారు. నా జీవితంలో నువ్వు ఎంతో ప్రత్యేకం. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ.. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.. హ్యాపీ రక్షాబంధన్.. అంటూ సీత‌క్క ఓ పోస్టు చేశారు. మ‌రోవైపు తెలంగాణ భవన్‌లో రాఖీ వేడుక‌లు నిర్వ‌హించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పార్టీ మ‌హిళా నేత‌లైన మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ విప్‌ గొంగిడి సునీత, ఇతర నేతలు రాఖీ కట్టి శుభాకాంక్ష‌లు తెలిపారు.

క‌విత‌ను త‌ల్చుకొని కేటీఆర్ భావోద్వేగం..
ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తన సోదరి కవితను గుర్తు చేసుకుంటూ ఎక్స్ లో భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈరోజు నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి. అయినప్పటికీ.. ఎలాంటి కష్టంలో అయినా నీ వెంట ఉంటా అంటూ పోస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత గ‌త మార్చి నుంచి తీహార్ జైలులో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img