Homeహైదరాబాద్latest NewsBREAKING NEWS: సీతారాం ఏచూరి కన్నుమూత.. ఆయన నేపథ్యమిదే..!

BREAKING NEWS: సీతారాం ఏచూరి కన్నుమూత.. ఆయన నేపథ్యమిదే..!

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 19న ఆయన ఆస్పత్రిలో చేరారు. చివరకు ఆరోగ్యం విషమించి చనిపోయారు.

సీతారాం ఏచూరి నేపథ్యమిదే!
ప్రముఖ కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఆగస్ట్ 12, 1952లో చెన్నైలో సర్వేశ్వరం సోమయాజులు, కల్పకం దంపతులకు జన్మించారు. ఆయన భార్య పేరు సీమ చిస్తీ. సీతారాం ఏచూరి దంపతులకు ఆశిష్, అఖిల అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1974లో SFI కార్యకర్తగా ఆయన జీవితం ప్రారంభం కాగా.. 1985లో సీపీఎం కేంద్రకమిటీలో చోటుదక్కింది. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img