Homeహైదరాబాద్latest Newsనేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,758.07 పాయింట్ల (క్రితం ముగింపు 81,501.36) వద్ద లాభాలతో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లో కూరుకుపోయింది. ఇంట్రాడేలో 80,905.64 కనిష్ట స్థాయిని తాకిన సూచీ, చివరికి 494.75 పాయింట్ల నష్టంతో 81,006.61 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 221.45 పాయింట్ల నష్టంతో 24,749.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.
సెన్సెక్స్‌లో నెస్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ అండ్ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభపడ్డాయి
బజాజ్ ఆటో షేర్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో 13.11 శాతం నష్టంతో రూ.1523 నష్టంతో రూ.10,093.50 వద్ద ముగిసింది.

Recent

- Advertisment -spot_img