ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ మరో కొత్త ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ పేరిట దీన్ని పరిచయం చేసింది. ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ అప్డేట్లతో తీసుకొచ్చింది. శాంసంగ్ కొత్త ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.20,999గా పేర్కొంది.