Homeహైదరాబాద్latest Newsనంద్యాల జిల్లాలో దారుణం.. కోడలిపై మామ అత్యాచారయత్నం

నంద్యాల జిల్లాలో దారుణం.. కోడలిపై మామ అత్యాచారయత్నం

నేటి సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరులో దారుణం చోటుచేసుకుంది. నాగటూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. శిరీష తన పొలంలో మొక్కజొన్న గింజలు కోసేందుకు వెళ్ళింది. అయితే అక్కడ పొలంలో పని చేస్తున్న కోడలిని చూసి..మేనమామ కురుమన్న కోడలుపై అత్యాచారానికి యత్నించాడు. అయితే ఆమె మేనమామ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమె తిరస్కరించడంతో అతను కోపంతో పక్కనే ఉన్న బండరాయితో ఆమె తలపై కొట్టాడు.. శిరీష ముఖంపై రాయి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది.తల్లి మరణంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img