Homeహైదరాబాద్latest Newsఆ కంపెనీ వాటాదారులకు శుభవార్త.. ఆ రోజు బోనస్ షేర్ల జారీ

ఆ కంపెనీ వాటాదారులకు శుభవార్త.. ఆ రోజు బోనస్ షేర్ల జారీ

దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన వాటాదారులకు శుభవార్త అందించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోనస్ షేర్ల రికార్డు తేదీని ప్రకటించారు. అయితే మొత్తం 37 లక్షల మంది షేర్ హోల్డర్లు లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 29న జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో బోనస్ షేర్ల జారీ నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 5న జరిగిన బోర్డు సమావేశంలో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ బోనస్ షేర్ల ఇష్యూకి సంబంధించిన రికార్డు తేదీని అక్టోబర్ 28, 2024గా కంపెనీ ఇటీవలే నిర్ణయించింది. ఈ బోనస్ షేర్ల జారీకి రూ.6766.23 కోట్లు వెచ్చించనున్నారు. బోనస్ షేర్ల జారీకి రికార్డు తేదీని ప్రకటించేందుకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు బై రేటింగ్ ఇచ్చాయి. వారు కొత్త టార్గెట్ ధరను కూడా చేసారు. ఒక్కో షేరుకు రూ.3265 కొత్త టార్గెట్ ధరను కంపెనీ సూచించింది.

Recent

- Advertisment -spot_img