అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డిఎఫ్సి తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.16,821 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.15,976 కోట్లతో పోలిస్తే నికర లాభం 5 శాతం పెరిగింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ.78,406 కోట్ల నుంచి రూ.85,500 కోట్లకు పెరిగిందని బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. వడ్డీ ఆదాయం రూ.67,698 కోట్ల నుంచి రూ.70,017 కోట్లకు పెరిగింది. నికర ఆదాయం రూ.30,110 కోట్లు అని పేర్కొంది. బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 1.34 శాతం నుంచి 1.36 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు కూడా 0.35 శాతం నుంచి 0.41 శాతానికి పెరిగాయి. ఏకీకృత ప్రాతిపదికన బ్యాంక్ 6 శాతం వృద్ధితో రూ.17,826 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.