JEE Main Result: JEE మెయిన్ మొదటి సెషన్ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన వెబ్సైట్లో ఫలితాల లింక్ను అందించింది. JEE మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గతనెల 22 నుంచి 29 వరకు జరిగిన తొలి సెషన్ పరీక్షకు 9 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
ALSO READ: Farmer Registry : రైతులకు అలర్ట్.. ఆ పథకాలు కావాలంటే ఈ కార్డు ఉండాల్సిందే..!!