ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 కోసం టీం ఇండియా కొత్త జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్ ఈ కొత్త జెర్సీలను ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. అయితే, ఈ జెర్సీపై ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరు ముద్రించబడింది.. ఇది భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఐసీసీ టోర్నీల్లో జెర్సీలు, కిట్లపై ఆతిథ్య దేశం పేరును ముద్రించడం ఆనవాయితీగా వస్తోంది.