Telugu Subject : తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలో పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ (Telugu Subject) తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల స్కూళ్లలో కూడా తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆదేశించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అమలు చేసేలా చూడాలని విద్యాశాఖను ఆదేశించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు దీనిని అమలు చేయాలని ఉత్తర్వులో పేర్కొంది.