Homeహైదరాబాద్latest Newsఅప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని వ్యాపారి ఆత్మహత్య..!

అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని వ్యాపారి ఆత్మహత్య..!

ఇదేనిజం, లక్షెట్టిపేట: లక్షెట్టిపేట పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో శేశోద్యల ప్రతాప్ సింగ్ (55) వ్యాపారి తన దుకాణంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని ఎస్సై సతీష్ బుధవారం తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు తన భార్యతో కలిసి బోళ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా వ్యాపారం సరిగ్గా సాగడం లేదని, అక్కడక్కడా అప్పులు కూడా చేసాడన్నారు. గత కొద్ది రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులతో ఎదో వ్యాపారం చేసి డబ్బు పొడగొట్టుకుని ఇబ్బంది పడ్డాడని, తనకు కూడా బయట సుమారు కోటి రూపాయల వరకు రావాల్సి ఉందని, తనకు రావాల్సిన డబ్బు సమయానికి రాకపోగా తను తెచ్చిన చొట ఇచ్చిన మాట ప్రకారం చెల్లించలేక పోతున్నానని మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. తను ఇచ్చే అప్పు వివరాలు అదేవిధంగా తనకు ఇవ్వాల్సిన వాళ్ళా వివరాలు మొత్తం సూసైడ్ నోట్ లో రాసి మృతికి పాల్పడ్డాడన్నారు. మృతుని భార్య ఉమ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Recent

- Advertisment -spot_img