యాద్రాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ శివారులోని హిందుస్థాన్ శానిటరీ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్ సమీపంలోని పొలంలో రైతులు గడ్డిని తగులబెట్టారు. హిందుస్థాన్ శానిటరీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. గోడౌన్ సమీపంలోని పొలంలో రైతులు గడ్డిని తగులబెట్టారు. ఈ క్రమంలో మంటలు ఎగిరి గోడౌన్లోని కాటన్ బాక్సులపై పడ్డాయి. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగలు అలుముకున్నాయి. గోడౌన్ సిబ్బంది సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.