ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే ”పుష్ప 2” సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున విడుదలై ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.