Homeహైదరాబాద్latest Newsభార్య కాపురానికి రావడం లేదని.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..!

భార్య కాపురానికి రావడం లేదని.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, నామాపూర్ గ్రామంలో పెసర దేవరాజ్ (31) అనే వ్యక్తి భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న దేవరాజ్ ను ముస్తాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే మృతి చెందాడు. వివరాలలోకి వెళ్తే.. దేవరాజ్ దంపతులకు పెళ్లి అయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది. పిల్లలు కాకపోవడంతో.. భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Recent

- Advertisment -spot_img