Homeహైదరాబాద్latest Newsకేవైసీ అప్‌డేట్ పేరుతో నయా మోసం.. చేయకపోతే సిమ్ కార్డ్ బ్లాక్ అంటూ మెసేజ్.. ఆ...

కేవైసీ అప్‌డేట్ పేరుతో నయా మోసం.. చేయకపోతే సిమ్ కార్డ్ బ్లాక్ అంటూ మెసేజ్.. ఆ తర్వాత..!

సైబర్ నేరగాళ్లు తాజాగా కేవైసీ అప్‌డేట్ పేరుతో నయా మోసానికి తెరలేపారు. ‘మీ సిమ్ కార్డు వివరాలలో సమస్యలు ఉన్నాయి. వెంటనే కేవైసీ అప్‌డేట్ చేయండి. లేదంటే మీ మొబైల్ నంబర్ బ్లాక్ అవుతుంది’ అంటూ వినియోగదారులకు కాల్స్ లేదా SMS చేస్తున్నారని భారత టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ (TRAI) తెలిపింది. ఇలా జరగకుండా ఉండాలంటే ఆధార్ సహా ఇతర పత్రాలు అప్‌లోడ్ చేయమని లింక్ లు పంపుతున్నారని, వీటిని క్లిక్ చేసి డబ్బు పొగొట్టుకోవద్దని ట్రాయ్ సూచించింది.

Recent

- Advertisment -spot_img