నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో లోక్సభలో కొత్త సంప్రదాయం మొదలవ్వనుంది. ఇక నుంచి సభకు హాజరయ్యే ఎంపీలు ఎలక్ట్రానిక్ ట్యాబ్లో డిజిటల్ పెన్తో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. పార్లమెంటులో పేపర్ వాడకూడదన్న స్పీకర్ ఓం బిర్లా ఆకాంక్ష మేరకు లాబీలో 4 కౌంటర్ల వద్ద ట్యాబులను ఉంచుతున్నామని LS సెక్రటేరియట్ తెలిపింది.