– 20 మంది విద్యార్థులకు గాయాలు
ఇదేనిజం, మహబూబ్ నగర్: స్కూల్ బస్సు బోల్తా పడటంతో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో చోటు చేసుకున్నది. మౌంట్ బాసిల్ స్కూల్కు చెందిన బస్సు జడ్చర్ల-మహబూబ్నగర్ మార్గంలో కొత్త తండా వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికులతో సహాయకచర్యలు చేపట్టారు. విద్యార్థులను దవాఖానకు తరలించారు.