ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడేళ్ల తర్వాత తొలిసారిగా పొల్యూషన్ అండర్ కంట్రోల్(PUC) టెస్టింగ్, సర్టిఫికేట్ ధరలను పెంచింది. పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీతో నడిచే బైక్, ఆటోల పీయూసీ ధరలను రూ.80గా నిర్ణయించింది. ఫోర్ వీలర్స్, అంతకంటే పెద్ద వాహనాల ధరలను రూ.180 చేసింది. ఇక డీజిల్ వాహనాలకు రూ.140గా ధర నిర్ణయించింది. మొత్తం మీద పీయూసీసర్టిఫికేట్ ధర రూ.40 పెరిగింది.