పశ్చిమ ఆఫ్రికా దేశం మారిటానియాలో ఘోర ప్రమాదం సంభవించింది. బోటు మునిగిన ఘటనలో 105 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ 89 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. బోటు బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మందిని మాత్రమే సహాయక బృందాలు రక్షించగలిగాయి. పశ్చిమ ఆఫ్రికా తీరం నుంచి కానరీ దీవులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.